Monday, June 29, 2020
శ్రీరాముడు రాజ్యాంగబద్ధమైన మరియు సాంస్కృతిక ప్రతీక. (రామజన్మభూమి ఉద్యమ గాధ-9)
Sunday, June 28, 2020
పర్యావరణ శాస్త్రవేత్త కామెగౌడ కథ ( ఇతను ఒక గొర్రెల కాపరి )
Saturday, June 27, 2020
*గ్రామస్వావలంబనే దేశానికి వెన్నెముక*
Friday, June 26, 2020
ఎగిసిన ఉప్పెన - కూలిన దాస్య చిహ్నం (రామజన్మభూమి ఉద్యమ గాధ -8)
Thursday, June 25, 2020
మరొక అడుగు...
ప్రథమ కరసేవ (రామజన్మభూమి ఉద్యమ గాధ-7)
ప్రథమ కరసేవ
1990వ సంవత్సరం మే 24వ తేదీ పవిత్ర హరిద్వార్ లో సాధు మహాత్ముల మార్గదర్శనంలో విరాట్ హిందూ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో రాబోయే అక్టోబర్ 30వ తేదీ దేవోత్థాన ఏకాదశి రోజు అయోధ్య రామ జన్మభూమి మందిరం నిర్మాణం కొరకు కరసేవచేయడానికై నిర్ణయం జరిగింది. ఈ సందేశాన్ని గ్రామ గ్రామం వరకు తీసుకెళ్లడానికి సెప్టెంబర్ ఒకటో తేదీ నాడు అయోధ్యలో అరణి మంథనం చేసి( చెక్కల రాపిడి వలన నిప్పును పుట్టించడం) వెలిగించిన దీపాలను రామజ్యోతి అని పిలిచి లక్షలాది గ్రామాలకు తీసుకువెళ్లారు. 1990 అక్టోబర్ 18వ తేదీన జరిగిన దీపావళి పండుగ దీపాలన్నీ రామజ్యోతులై వెలిగాయి, జ్యోతులతోపాటు లక్షలాది మంది అయోధ్య రావలసిందిగా సందేశం కూడా చేరింది.
మరొకవైపు అహంకార పూరితుడైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ ఎవరినీ ఉత్తర ప్రదేశ్ లోకి అనుమతించనని, అయోధ్యలో పక్షి కూడా ఎగరకుండా చూస్తానని ప్రకటనలు చేశాడు. దేశం నలుమూలల నుండి వచ్చే భక్తులను ఆపివేయడానికి రోడ్లు అన్నింటిని మూసి వేశాడు. అయోధ్యకి వెళ్లవలసిన రైళ్ళు బస్సులన్నింటిని రద్దు చేశాడు. 22వ తేదీ నుండి అన్ని దారులపైన ప్రతి 100 మీటర్లకు ఒక బ్యారికేడ్ చొప్పున నిర్మించి నగరాన్ని దిగ్బంధనం చేయగా అయోధ్య నగరం మొత్తం పోలీస్ స్టేషన్ గా మారింది.
దేవోత్థాన ఏకాదశి అక్టోబర్ 30వ తేదీ రానే వచ్చింది దేశం నలుమూలల నుండి అనేక ఆటంకాలు దాటి స్థానిక ప్రజలు స్వాగతం పలుకుతూ ఉండగా ఆదరించి భోజనం పెట్టి సద్దులు కట్టి పంపుతుండగా అడవుల గుండా, పొలాల గట్ల వెంబడి ప్రయాణిస్తూ వచ్చిన కరసేవకులు వానర సైన్యం మాదిరిగా అనుకున్న తేదీ,అనుకున్న సమయానికి కరసేవ చేయడానికై అయోధ్య రామజన్మభూమి మందిరము స్థలం వైపు బయలుదేరారు. వారిని దుష్టశక్తులు ఆపే ప్రయత్నాలెన్ని చేసినా జన్మభూమి స్థలం చేరనే చేరారు. చూస్తుండగానే గుమ్మటాల పైకెక్కి కాషాయ జెండాను ఎగురవేసారు. బాబర్ కట్టించిన గుమ్మటాలు, గోడలను త్రవ్వి ప్రతీకాత్మకంగా కరసేవను నిర్వహించారు.
కరసేవ చేయడం కోసం వచ్చినవారు అయోధ్య లోనే ఉండి అనుకున్న పని మొత్తం చేసి వెళ్లడం కోసం నిరీక్షిస్తున్నారు. మరుసటి రోజు నవంబర్ 1 వ తేదీ భజనలు కీర్తనలతో గడిచిపోయింది. కరసేవ చేయడం వలన అహంకారి ముఖ్యమంత్రి ములాయం సింగ్ తల తీసేసి నట్లయింది అవమానం జరిగిందని కోపోద్రిక్తుడై తన పోలీసు బలగాలకు ఆజ్ఞ జారీ చేశాడు.... రెండవ తేదీ ఉదయం నుండే మరింత సాయుధ పోలీసు బలగాలు వచ్చి చేరుతున్నాయి. ఇవేవీ గమనించని రామభక్తులు భజనలు కీర్తనలతో సత్యాగ్రహం చేస్తూ వీధుల్లో కూర్చున్నారు. పోలీసు బలగాలు వచ్చీరాగానే స్వాతంత్ర్య పోరాటం సమయం జలియన్ వాలా బాగ్ లో నిరాయుధులను చంపిన భయంకరుడైన డయ్యర్ కన్నా మరింత అధమంగా ఆలోచించిన మూర్ఖ ములాయం నిరాయుధులైన భక్తులపై విచక్షణా రహితంగా కాల్పులు జరపండని ఆజ్ఞ జారీ చేశాడు. ఆ ఘటనలో అనేక మంది ప్రాణాలు అర్పించారు. వేలాది మంది గాయపడ్డారు. బెంగాల్ కలకత్తా నుండి వచ్చిన కొటారి సోదరులిద్దరినీ పట్టుకొని పాయింట్ బ్లాక్ రేంజ్ లో కాల్చి హత్య చేశారు. ఇలా సాధువులను, సన్యాసులను,సామాన్య ప్రజలను ఎంత మందిని హత్య చేశారో.., కొందరి నైతే ఇసుక బస్తాలను కట్టి సరయూ నదిలో వేశారు, ఇళ్లల్లో దూరి హత్యలు చేశారు. పోలీసులు జరిపిన కాల్పులలో తూటాల తగిలినవారి రక్తం అయోధ్య వీధుల్లో ధారలై ప్రవహించాయి. ఆనాటి కాల్పులనాటి ఆనవాళ్ళు అయోధ్య వీధుల్లో ఇప్పటికీ కనబడతాయి. ఇలా సాధుజనుల హత్యలు చేసి రాక్షసుడయ్యాడు ములాయంసింగ్.
బలిదానం అయిన కరసేవకుల అస్తికలను పూజించి యాత్ర రూపంలో తీసుకెళ్లి నదులలో కలుపుతూ ఉండేవారు. ఈ అస్తికలశ యాత్రలలో కోట్లాది మంది రామభక్తులు పాల్గొన్నారు. ములాయం హత్యాకాండ పట్ల ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. దేశం నలుమూలలా సత్యాగ్రహపు జ్వాలలు ఎగిశాయి. 1991 జనవరి 14వ తేదీ మాఘమేళ సందర్భంగా ప్రయాగరాజ్ లోని త్రివేణి సంగమంలో బలిదానమైన కరసేవకుల అస్థికలను సంపూర్ణంగా నిమజ్జనం చేసి మందిర నిర్మాణం పట్ల నిబద్ధులమై ఉన్నామని మరిన్ని బలిదానాలు చేయడానికి కూడా సిద్ధమేనని లక్షలాదిగా సాధువులు సన్యాసులు ప్రజలు ప్రతిజ్ఞలు తీసుకున్నారు.
ప్రపంచ చరిత్రలోనే పెద్ద సభ :
ములాయం హత్యాకాండతో ఆగ్రహంతో ఉన్న హిందూ సమాజం ఏప్రిల్ 4వ తేదీ 1991 సంవత్సరం ఢిల్లీలో బోట్స్ క్లబ్ పరిసరాల్లో సాధువులు సన్యాసుల నాయకత్వంలో విశాలమైన సభ నిర్వహించడానికి నిర్ణయం అయింది.చరిత్ర సృష్టించిన అద్భుతమైన సభ నాటి సంఘటనలను మనం వివరంగా తెలుసుకోవాల్సిందే.
1991 ఏప్రిల్ 4వ తేదీ ప్రపంచంలోనే అత్యంత పెద్ద సంఖ్యలో ప్రజల్ని సమీకరించిన విశ్వహిందూ పరిషత్.
ఆరోజు రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో నిలుచున్న మాకు ఆ రోజుల్లో కొత్తగా ఏర్పాటైన టెలివిజన్లలో బిబిసి న్యూస్ చూసే అవకాశం వచ్చింది. ఆనాటి వార్తల్లో ఢిల్లీలో జరిగిన కార్యక్రమాన్ని గురించి వర్ణిస్తూ చెప్పిన విషయాలు నాకే కాదు భారత ప్రజలకెప్పటికీ గుర్తుంటాయి .
1) 25 లక్షలకు పైగా రామభక్తులైన హిందువులు పాల్గొనిఉంటారని చెబుతూ ఇది ప్రపంచంలోనే అతి పెద్దదయిన సమావేశమనీ, సభా దృశ్యాలను చూపిస్తూ వర్ణిస్తూ చెప్పారు.
2) సభకొచ్చిన 25 లక్షలకు పైగా ఉన్న రామభక్తులకు ఢిల్లీ పరిసర ప్రాంతాల ప్రజలు భోజనం, వసతులు కల్పించారని.
3) అంతమంది పాల్గొన్న సభలో ఒక్క పోలీసు కనిపించలేదని,
4) లక్షలాదిగా వచ్చిన వారందరూ వేదికపై నుండి చెప్పే సూచనలను పాటిస్తూ క్రమశిక్షణతో కూర్చుండి పోయారని.
ఇక ఆనాటి సభా వేదిక సరిగ్గా ఢిల్లీ లోనే అతిపెద్దదైన బోట్స్ క్లబ్ మైదానంలో, (రాష్ట్రపతి భవనం ఎదురుగా ) ఏర్పాటు చేయగా, స్వామి నృత్య గోపాల్ దాస్ స్వామి, రామానంద చార్యజీ, సాద్వి ఋతంభర, సాద్వి ఉమాభారతి వంటి అనేకమందిపూజ్య సాధుసంతులతో పాటు,కీర్తిశేషులు పూజనీయ అశోక్ సింగల్ జి, అప్పటి సర్ కార్యవాహ కీర్తిశేషులు మాననీయ శేషాద్రిగారు వంటి అనేక మంది పెద్దలున్న ఆ వేదికపై రెండు వందల మందికి పైగా మహాత్ములు కూర్చుని ఉన్నారు. ఆ సభకు గుజరాత్ కు చెందిన పంచఖండ్ పీఠాధిపతి శ్రీధర్మేంద్రజి మహరాజ్ అధ్యక్షత వహించారు.
రామభక్తులు సభాస్థలమంతా నిండిపోవడమే కాదు, మొత్తం ఢిల్లీ అంతా నిండిపోయి కిక్కిరిసి ఉన్నారు. సరిగ్గా అదే రోజు అయోధ్య రామజన్మభూమిలో కరసేవకుల పైన రాక్షసత్వంతో కాల్పులు జరిపి హత్యలు చేసిన ములాయం సింగ్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది.ఆ విషయాన్ని ప్రకటించిన పూజ్య సాధ్వి ఋతంభర గారి ఉత్సాహకరమైన ఉపన్యాసం విని ఒక్కసారిగా జయ కారాలు చేస్తూ లేచి నిలబడిన లక్షల మంది ముందుకు నడవడం ప్రారంభించారు.సభలో పాల్గొన్న వారు లేచి ముందుకు రావడం తొక్కిసలాటకు దారి తీసే అవకాశం ఉంది. దానిని ముందే గమనించిన సభా నిర్వాహకులు ధర్మేంద్రజి మహారాజ్ లేచి నిలబడి సాద్విఋతంభర గారి చేతిలోని మైకును తీసుకొని ,
"జో జో రామభక్త్ హై ఓ వహి బైట్ జాయియే". (ఎవరైతే రామభక్తులో వారంతా ఎక్కడి వారక్కడే కూర్చుండి పొండి.) అని చేసిన ఒక్క సూచనతో లేచి నిల్చున్న లక్షలమంది మరు నిమిషంలోనే క్రమశిక్షణతో కూర్చుండిపోయారు . ఇది నా కళ్ళతో చూసిన అద్భుతమైన ఘటన.
ఉత్సాహంతో వేలాది మంది బోట్స్ క్లబ్ మైదానంలో ఉన్న వందలాది పెద్దపెద్ద వృక్షాలపై ఎక్కి కూర్చున్నారు. సంఖ్య పెరిగి చెట్లు కొమ్మలు వంగి విరిగిపోయే పరిస్థితిని చూసి 'చెట్లపై హనుమంతుని వలె కూర్చున్న భక్తులారా మీరందరూ మరుక్షణమే దిగి కింద కూర్చోండి', ఈ సూచన కూడా మంత్రంవలె పనిచేసింది, సూచన తర్వాత మరెవరు చెట్టుపైన కనిపించలేదు. *ఇంత చక్కని మాస్ మేనేజ్మెంట్, మైక్ మేనేజ్మెంట్ దృశ్యాలు కండ్ల ముందు ఇప్పటికీ కదలాడుతున్నాయి.*
- ప్రతివీధి మూలమలుపు దగ్గర ప్రతి 500 మీటర్లకు ఢిల్లీ మరియు పరిసర ప్రాంతాలలోని ప్రజలు వండి ప్యాకెట్లుగా పంపిన లక్షలాది భోజన పొట్లాలు పాల్గొన్న వారందరి ఆకలితీర్చాయి.
- తెలుగు రాష్ట్రాలు మరియు దక్షిణాది నుండి సభలో పాల్గొనడానికి వచ్చి నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ లో దిగిన వారికి Bharat scouts guides కు చెందిన విశాలమైన మైదానము మరియు గుడారాలు కలిగిన ప్రదేశంలో వసతి ఏర్పాటు చేశారు.
ఢిల్లీ బోట్స్ క్లబ్ సభానంతరం తిరుగు ప్రయాణమైన భక్తులు అయోధ్య, మథుర, కాశీ విశ్వేశ్వరుని పుణ్యక్షేత్రాలలో ఆలయాలను దర్శించుకుని అక్కడి పురాతన ఆలయాలను విధ్వంసం చేసిన ముస్లింల దౌర్జన్యాలకు ఆనవాళ్లుగా కట్టబడిన మసీదు వంటి కట్టడాలను చూసి వేడి నెత్తురుప్పొంగగా, రక్త కన్నీరు కార్చిన రామభక్తులు కసితో తమతమ ప్రాంతాలకు తిరిగి వెళ్లారు.
ఇంకా ఉంది...
-ఆకారపు కేశవరాజు.
Tuesday, June 23, 2020
*శ్రీ రామ జన్మభూమి న్యాస్ నేతృత్వంలో రామమందిర ఉద్యమం* (ఉద్యమగాథ-6)
"కరోనోనిల్" ఔషధంతో వైరస్ ను తరిమేద్దాం
రాజనీతి వైతాళికుడు శ్యామ ప్రసాద్
Monday, June 22, 2020
శ్రీ పూరి జగన్నాథ రథయాత్ర
స్వామి మూర్తి నుంచి ప్రసాద వితరణ వరకు ఎన్నో అంశాలలో భిన్నత్వం కనిపిస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రథోత్సవమే శూన్య మాసంగా వ్యవహరించే ఆషాఢంలో జరగడం ఒక ఉదాహరణ. నిరాటంకంగా సాగిపోయే జగన్నాథ చక్రాలకు కరోనా మహమ్మారి వేగనిరోధకంగా నిలిచింది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఈ వ్యాధి కారణంగా ప్రభుత్వ నిబంధనలు ఈ ‘శోభాయాత్ర’ను నిలువరించినట్లయింది.
సర్వవ్యాపి నారాయణుడి విశిష్ట, వైభవాలను యావత్ ప్రపంచానికి చాటుతూ ఉత్తరాదిన బదరీనాథ్, ద్వారక, దక్షిణాదిన శ్రీరంగం, తిరుపతి, మధ్య తూర్పున పూరీధామాలు ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నాయి. శ్రీమహావిష్ణువు రామేశ్వరంలో స్నానసంధ్యా దులు ముగించుకుని, బదరీనాథ్లో అల్ఫాహారం స్వీకరించి, మధ్యాహ్న భోజనానికి పూరి ధామం చేరుకుంటారని, రాత్రి ద్వారకలో విశ్రమిస్తాడని పురాణ గాథ.
జగన్నాథుడు అంటే విశ్వరక్షకుడు. ఆయనను ‘దారుబ్రహ్మ’అంటారు. మనకు తెలియని బ్రహ్మ పదార్థం ఏదో ఆయనలో ఉంది.
పూరిని శ్రీ క్షేత్రంగా వ్యవహరిస్తారు. నీలాచలం, నీలాద్రి, జగన్నాథపురి, పురుషోత్తమధామం అనీ అంటారు. శ్రీకృష్ణుడు రుక్మిణీ సత్యభామాదుల దేవేరులతో కాకుండా అన్న బలరాముడు, చెల్లెలు సుభద్రతో జగన్నాథస్వామిగా కొలువుదీరడం ఇక్కడి ప్రత్యేకత. శ్రీపీఠం’గా పిలిచే పూరీ ఆలయం 214 అడుగుల ఎత్తయిన గోపురంతో 68 అనుబంధ ఆలయాలతో భక్తజనావళిని అలరిస్తోంది.
స్వామివారికి పూజాదికాలు ఘనంగా నిర్వహించినా దర్శనం మాత్రం సాధారణంగా, నిరాడంబరంగా ఉంటుంది. ఇక్కడ ప్రత్యేక దర్శనాలు ఉండవు. ‘కోటికి పడగెత్తిన ధనవంతుడూ నీ గుడి ముంగిట సామాన్యుడు’ అని ఒక కవి అన్నట్లు, ఎంతటి ఉన్నతులైనా జగన్నాథుడి ముందు అతి సామాన్యులే. ప్రతి ఉదయం ‘సహనమేళ’పేరుతో దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు నేరుగా ‘రత్నసింహాసనం’ వద్దకు చేరి స్వామిని అతి సమీపం నుంచి దర్శించుకోవచ్చు.
శంకర భగవత్పాదులు,
రామానుజయతీంద్రులు, మధ్వాచార్యులు తదితర ఎందరో మహనీయులు ఈ క్షేత్రాన్ని సందర్శించారు. పీఠాలు నెలకొల్పారు. శంకరాచార్యులు దేశ పర్యటనలో భాగంగా నలుదిక్కులా నెలకొల్పిన నాలుగు పీఠాలలో ఇదీ ఒకటి. దీనిని ‘భోగవర్థన’మఠంగా వ్యవహరిస్తారు. బదరినాథ్లో జ్యోతిర్మతి, రామేశ్వరంలో శృంగేరి, ద్వారకలో శారద పీఠాలు స్థాపితమయ్యాయి. వీటిని వరుసగా త్యాగ, భోగ, ఐశ్వర్య క్షేత్రాలుగా అభివర్ణిస్తారు. పూరీ మఠానికి ‘కర్మ’ క్షేత్రమని పేరు. స్వామి సదా తన కన్నుల ముందే ఉండాలంటూ ‘జగన్నాథస్వామి నయన పథగామీ భవతుమే’ అని జగన్నాథాష్టకంలో శంకరులు స్తుతించారు. రామానుజులు వైష్ణవ సంప్రదాయాన్ని ప్రతిష్ఠించేం దుకు ప్రయత్నించారు. ఆయన ద్వారా తెలుగునాట ‘జగన్నాథ సేవ’ ప్రాచుర్యం పొందింది. చైతన్య మహాప్రభువు శేష జీవితం ఇక్కడే గడిపారు. సిక్కుగురువు గురునానక్, శ్రీపాదవల్లభులు, కబీర్, తులసీదాస్ వంటి మహనీయులు ఈ క్షేత్రాన్ని సందర్శించారని చరిత్ర. జయదేవుడు స్వామి సన్నిధిలో రచించిన ‘గీత గోవిందం’ కావ్యాన్ని ఆయనకే అంకితమిచ్చారు.
ఈ క్షేత్రంలోని దేవదేవతా విగ్రహాల నుంచి ఊరేగింపులు, ఉత్సవాలు, ప్రసాద వితరణ వరకు ఎన్నో అంశాలలో ఎన్నో ప్రత్యేకతలు. సాధారణంగా ఆలయాలలో స్వామి మూలరూపం స్వయంభువు గానో, ప్రతిష్ఠించో ఉంటుంది. పూరీనాథుడు జగన్నాథుడు ‘దైవం చెక్కిన దారుశిల్పం’. బలభద్ర, సుభద్ర, జగన్నాథుల విగ్రహాలు మొండి చేతులతో, నడుం వరకే దర్శనమిస్తాయి. విచిత్రంగా… దారుమూర్తులుగా పెద్ద కళ్లు మినహా, కాళ్లు, చేతులు, పెదవులు, చెవులు లేకుండా కేవలం ఒక చెట్టుకు పసుపు, కుంకుమలతో అలంకరించినట్లు ఉంటాయి. బలభద్రుడి విగ్రహం ఐదు అడుగుల ఐదు అంగుళాలు, సుభద్ర విగ్రహం ఐదు అడుగులు, జగన్నాథుని విగ్రహం ఐదు అడుగుల ఏడు అంగుళాలు ఉంటాయి.
అవయవ లోపంగల విగ్రహాలు అర్చనకు అనర్హమంటారు. కానీ ఈ నీలాచల క్షేత్రంలో అదే ప్రత్యేకత. ఇందుకు సంబంధించి వాడుకలో ఉన్న కథనం ప్రకారం, పూరీనాథుడికి నీలమాధవుడు అనీ పేరు. విశ్వావసు అనే శబర నాయకుడు ఈ స్వామికి తొలి పూజలు చేసినట్లు చరిత్ర చెబుతోంది. గంగ వంశీయులు స్వామికి ఆలయం నిర్మించారు. నీలమణితో తయారైన నీలమాధవుని విగ్రహం కాలగర్భంలో కలసిపోగా దాని ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ప్రయత్నాలు సాగాయి. ‘సముద్రంలో కొట్టుకు వచ్చే కలప దుంగతో తన మూర్తిని చెక్కించవలసింది’గా ఇంద్రద్యుమ్నుడనే రాజును శ్రీ మహావిష్ణువు స్వప్నంలో ఆదేశిస్తారు. ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆ కార్యభారాన్ని స్వీకరిస్తారు. 21 రోజలు వరకు తన పనికి ఆటంకం కలిగించవద్దని సూచిస్తారు. అయితే రాజదంపతులు ఉత్సుకతతో పక్షం రోజులకే తలుపులు తెరిపించగా, మూడు ప్రతిమలు అసంపూర్ణంగా కనిపించాయట. శిల్పి జాడలేదు. దాంతో ఆ శిల్పిని సాక్షాత్ శ్రీమన్నారాయుణుడిగా భావించిన రాజు తమ పొరపాటునకు చింతించి, ఆ మూర్తులను యథాతథంగా ప్రతిష్ఠించి మందిరం కట్టించారట.
రథయాత్ర వైశిష్ట్యం
పూరీ పేరు విన్నవెంటనే స్ఫురించేది రథయాత్ర. ప్రపంచంలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలలో ఒకటైన పూరీ‘నాథుడి’ రథయాత్రకు గల విశిష్టత, వైభోగం మరెక్కడా లేదు. ఇది విశ్వజనీనమైన వేడుక. ‘రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే…’ రథంపై ఊరేగే విష్ణుదర్శనంతో పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. అందునా పూరీ జగన్నాథుడి రథోత్సవం మరింత విశిష్టమైందిగా చెబుతారు. ఇతర క్షేత్రాలలో ఉత్సవమూర్తులు ఆలయ/పురవీధుల్లో విహరిస్తే, ఇక్కడ మూలవిగ్రహాలే తరలి వెళతాయి. ఈ రథయాత్రను సోదరి ప్రేమకు ప్రతీకగా కూడా చెబుతారు. రథయాత్ర నేపథ్యంలో రకరకాలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. సోదరి సుభద్రను ఆనందపరచడమే ఈ రథయాత్ర లక్ష్యమంటారు. బలరామకృష్ణులు కంసవధకు బయలుదేరిన ఘట్టానికి ఈ యాత్ర చిహ్నం పేర్కొంటారు. వారితోపాటు వెళ్లాలనుకున్న సుభద్రదేవి కోరిక తీర్చే ముచ్చటే ఈ రథయాత్రని కూడా చెబుతారు.
త్రివిధ రథాలు
ఏ ఆలయంలోనైనా ఊరేగింపు సేవలో ఎప్పడూ ఒకే రథాన్ని వినియోగిస్తారు. ఇందుకు భిన్నం పూరీ క్షేత్రం. ఇక్కడ ఏటా కొత్త రథాలు తయారవుతాయి. ఇతర ఆలయాలలోని దేవదేవేరులను ఒకే రథంలో ఊరేగించడం కనిపిస్తుంది. ఇక్కడ అందుకు భిన్నంగా ముగ్గురికి వాహనాలు. 44 అడుగుల ఎత్తుతో 14 చక్రాలతో గల బలరాముని రథాన్ని ‘తాళధ్వజం’ అంటారు. ఎర్రటి చారలున్న నీలి వస్త్రంతో దీనిని అలంకరిస్తారు. 43 అడుగుల ఎత్తు12 చక్రాలతో గల సుభద్రాదేవి రథాన్ని ‘పద్మధ్వజం’ (దర్పనదళ) అంటారు. ఎర్రటి చారలుగల నలుపు వస్త్రంతో అలంకరిస్తారు. జగన్నాథస్వామి రథాన్ని ‘నందిఘోష్’ అంటారు. 16 చక్రాలతో 45 అడుగుల ఎత్తుగల ఈ రథాన్ని ఎరుపు, పసుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు… ప్రతి రథానికి 250 అడుగుల పొడవు, ఎనిమిది అంగుళాల మందం గల తాళ్లను కడతారు. గజపతి మహారాజు జగన్నాథుడి తొలిసేవకుడు. రథయాత్ర ఆరంభానికి ముందు ఆయన తన కిరీటాన్ని తీసి నేలపై ఉంచి బంగారు చీపురుతో రథాలను శుభ్రపరచి మంచిగంధం నీటితో కడుగుతారు. దీనిని ‘చెర్రాపహరా’ అని వ్యవహరిస్తారు. దైతపతులనే శబరులు గిరిజన సంప్రదాయం ప్రకారం పెద్ద పూలకిరీటాలు, రంగురంగుపూలు, పూసలతో ‘జగన్నాయకుల’ను అలకరించి, తప్పెట్లు, శంఖనాదాలు, భాజాభజంత్రీల మధ్య పాటలు పాడుతూ విగ్రహాలను రథాలపైకి చేరుస్తారు. శబరులే ఈ పక్రియనంతా నిర్వహిస్తారు తప్ప ఎక్కడా వేద పండితులు ఉండరు.
ఇతర క్షేత్రాలలో ఉత్సవమూర్తులు పురవీధుల్లో విహరిస్తే, ఇక్కడ మూలవిగ్రహాలే తరలి వెళతాయి. ‘యాత్ర’లో బలభద్రుని రథం ముందుభాగంలో, దాని వెంట సోదరి సుభద్ర రథం వెళుతుంటే, జగన్నాథుడి తేరు వారిని అనుసరిస్తూ చెల్లెలిని సు‘భద్రం’గా చూసుకోవలసిన తీరును బోధిస్తున్నట్లుంటుంది. ఆలయ నిబంధనల ప్రకారం ‘యాత్ర’ ప్రారంభమైన తరువాత ఎట్టి పరిస్థితల్లోనూ రథం తిరోగ మించకూడదు. ఈ ‘ఘోషయాత్ర’ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుని ప్రమాదవ శాత్తు ఎవరైనా రథం కింద పడినా, దారిలో ఏ దుకాణమైనా అడ్డు వచ్చిన రథం వెనకగడుగు వేసే ప్రసక్తి ఉండదు. ఆలయం వద్ద ప్రారంభమైన రథయాత్ర అంగుళం అంగుళం కదులుతూ మూడు కిలోమీటర్ల దూరంలోని గుడించా (దేవతామూర్తులను ప్రతిష్ఠించిన రాజు ఇంద్రుద్యుమ్నుడి పట్టపురాణి గుడించ మందిరమని స్థలపురాణం)ఆలయానికి చేరడానికి 10నుంచి 12 గంటల సమయం పడుతుంది. ఆ రాత్రి ఆరుబయట రథాలలోనే మూలమూర్తులకు విశ్రాంతినిస్తారు. మరునాడు ఉదయం మేళతాళాలతో మందిరంలోకి తీసుకువెళతారు. వారం రోజులు గుడించా ఆతిథ్యం స్వీకరించి దశమినాడు తిరుగు ప్రయాణమవుతారు. దీనిని ‘బహుదాయాత్ర’ అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలు శ్రీపీఠం (జగన్నాథ ఆలయం) చేరుకుంటాయి. ఇక్కడా విగ్రహాలు ఆరుబయటే ఉండిపోతాయి. మరునాడు (ఏకాదశి) స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. దీనిని ‘సునావేష’అని వ్యవహరిస్తారు. విగ్రహాలను ఆలయ ప్రవేశం చేయించి, రత్నసింహాసనంపై ప్రతిష్ఠించడంతో రథయాత్ర ముగుస్తుంది.
కులం, భాష, సంస్కృతి, లింగ, పేద – ధనిక, పండిత-పామర, వయోభేద రహితంగా లక్షలాది మంది ఈ రథయాత్రలో పాల్గొంటారు. రథాన్ని లాగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఊరేగింపునకు బయలుదేరిన రథం మరునాడు సూర్యోదయంలోగా యథాస్థానానికి తిరిగి రావలన్నది శాస్త్రవచనం. కానీ ఈ క్షేత్రంలో బయలుదేరిన మూడు రథాలు తొమ్మిది రోజుల తర్వాతే ఆలయానికి చేరుకుంటాయి.
సర్వం శ్రీ జగన్నాథం
జగన్నాథుడు నైవేద్య ప్రియుడు. నిత్యం 64 రకాల పిండివంటలను కట్టెలపొయ్యిల మీదనే తయారు చేస్తారు. ఆయన వంటశాల దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలలోని వంటశాలల కంటే పెద్దది. ప్రసాదాలన్నీ మట్టి కుండలలోనే వండుతారు. ఒకసారి వాడిన పాత్రను మరోసారి ఉపయోగించరు. కుండమీద కుండపెట్టి అన్నం వండడం, అన్ని పాత్రలలోని పదార్థం ఒకేలా ఉడకడం విశేషమే. శ్రీ మహాలక్ష్మీ దేవి వంటలను స్వయంగా పర్యవేక్షిస్తారని భక్తుల విశ్వాసం. జగన్నాథుని ప్రసాదం రెండు రకాలు. అన్నప్రసాదం, శుష్క ప్రసాదం. దైవదర్శనం తర్వాత తీసుకునేది అన్నప్రసాదం కాగా, ఇళ్లకు తీసుకువెళ్లేది శుష్కప్రసాదం. మహాప్రసాదం స్వీకరణలో అంటూ సొంటూ ఉండదు. ‘సర్వం శ్రీ జగన్నాథం’ నానుడి అలానే పుట్టిందంటారు. ఎందరు భక్తులు ఎప్పుడు వచ్చినా కాదనకుండా, లేదనుకుండా అన్నం దొరికేది జగన్నాథధామం.
నవకళేబర ఉత్సవం
ఎనిమిది నుంచి ఇరవై ఏళ్లకోసారి నవకళేబర ఉత్సవం నిర్వహిస్తారు. అంటే గర్భాలయంలోని మూలవిరాట్లను ఖననం చేసి, కొత్త విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు. అధిక ఆషాఢం వచ్చిన సంవత్సరం ఉగాదినాడు ఈ ఉత్సవం ప్రారంభమై నాలుగు నెలల పాటు కొనసాగుతుంది. ఆ సందర్భంగా పాత విగ్రహాలలోని బ్రహ్మ పదార్థాన్ని అత్యంత రహస్యంగా కొత్త విగ్రహాలలో నిక్షిప్తం చేస్తారు. విగ్రహాలు నిర్మాణం తరువాత సహజసిద్ధంగా ఆకులు, బెరడు నుంచి సేకరించిన రంగులు పూస్తారు. జగన్నాథుడి విగ్రహానికి వాటితోపాటు కస్తూరి నుంచి తీసిన రంగును అద్దుతారు. రథయాత్రకు ముందు రోజు నూతన విగ్రహాలను శ్రీపీఠంపై ప్రతిష్ఠించి విశేష అర్చనాదులు నిర్వహించి భక్తులకు జగన్నాథ దర్శన భాగ్యం కల్పిస్తారు. దీనిని ‘నవ యవ్వన దర్శనం’ అంటారు. ఏటా జరిగే జగన్నాథ రథయాత్రే విశిష్టమైనదనుకుంటే, నవకళేబర ఉత్సవ సంవత్సరం నాటి ‘యాత్ర’ మరింత ప్రత్యేకమైంది. స్వామి వారి నూతన రూప సందర్శనకు భక్తులు పోటెత్తుతారు. ఏటా జరిగే రథోత్సవానికి హాజరయ్యే భక్తుల కంటే సుమారు అయిదారు రెట్లు ఎక్కువగా తరలివస్తారు. నవకళేబర మొదటి ఉత్సవం క్రీ.శ.1308లో జరిగినట్లు తెలుస్తోంది. ఈ శతాబ్దపు మొదటి ఉత్సవాన్ని అయిదేళ్ల క్రితం (2015)లో నిర్వహించారు. తరువాతి ఉత్సవం 2035లో జరుగుతుంది.
సమానత్వం జగన్నాథ తత్వ్తం
సర్వమానవ సమానత్వం, లౌకికతత్వ్తం జగన్నాథుని సిద్ధాంతం. దానిని అవగాహన చేసుకుంటే లోకమంతా అనందమయ మవుతుందని, కులమతవర్ణ వైరుధ్యాలకు అతీతమైన సమసమాజం సిద్ధిస్తుందని విశ్వాసం. ఈ స్వామి సన్నిధిలో దర్శనం, అర్చనాదులలో హెచ్చుతగ్గులు, ‘మహాప్రసాద’ స్వీకరణలో తేడాలు, అంటూసొంటూ ఉండదు. ఎంగిలి అంటదు. ఆనందబజారులో ఒకే పంక్తిన ప్రసాదాలు అందచేస్తారు. ఎవరైనా వడ్డించవచ్చు. ఎవరైనా తినవచ్చు. కనుకనే ‘సర్వం శ్రీ జగన్నాథం’ అనేది వాడుకలోకి వచ్చింది. పదార్థాలను పూర్తిగా వినియోగించవలసిందే తప్ప పారవేయడానికి వీలులేదు. ఇక, దేవదేవుడికి అందే సేవలు మానవ జీవిత చక్రాన్ని పోలి ఉంటాయి. ఆయనకు సహితం మానవుడిలా ఆకలిదప్పులు, అనారోగ్యం, మమతలు, అభిమానాలు, అలకలు తదితర లౌకిక జీవన ఘట్టాలు కనిపిస్తాయి. రథోత్సవం ప్రారంభానికి ముందు 108 బిందెలతో దేవతామూర్తులకు మంగళ స్నానం చేయిస్తారు. ఈ ‘సుదీర్ఘ’ స్నానంతో వారు మానవ సహజమైన అనారోగ్యం బారిన పడి, తిరిగి కోలుకునే వరకు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటారట. పదుల సంఖ్యలో రకరకాల ఆహార పదార్థాలు స్వీకరించే భోజన ప్రియస్వామికి అనారోగ్యం కారణంగా ఆ సమయంలో కేవలం కందమూలాలు, పండ్లను ‘పథ్యం’గా సమర్పిస్తారు. రథయాత్ర అనంతరం అంతరాలయ పునః ప్రవేశంతో ‘నేత్రోత్సవం’ పిదప యథాప్రకారం నైవేద్యం సమర్పిస్తారు. శ్రీవారు తనను మరచి అన్నా చెల్లెళ్లతో పురవిహారం సాగించారన్న కినుకతో శ్రీమహాలక్ష్మి – జగన్నాథుడిని మందిరంలోకి వెళ్లకుండా అడ్డుకుందని, స్వామి కొన్ని మధుర పదార్థాలు ఇచ్చి ఆమెను ప్రసన్నం చేసుకొని మందిర ప్రవేశం చేస్తారని కథనం. అర్చకులు ఆ సన్నివేశాన్ని పాటలతో అభినయించడం ఆకట్టుకునే దృశ్యం.
భాగ్యనగరిలో ‘ఉత్కళ’ నాథుడు
భాగ్యనగర్ (హైదరాబాద్)లో ఉత్కళనాథుడు కొలువుదీరాడు. పూరీ ఆలయ శిల్పకళా సౌందర్యానికి ప్రతీకగా బంజారాహిల్స్లో ఎకరంన్నర విస్తీర్ణంలో జగన్నాథ మందిరం నిర్మితమైంది. 74 అడుగుల ఎత్తు గోపురంతో కల ఆలయ ప్రాంగణంలో శ్రీమహాలక్ష్మి, కాశీ విశ్వనాథ, విమల (దుర్గాదేవి), గణపతి, హనుమాన్, నవగ్రహ ఉపాలయాలు ఉన్నాయి. కళింగ కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పూరీ క్షేత్రం తరహాలోనే ఇక్కడా అర్చనాదులు నిర్వహిస్తున్నారు.
‘నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే!
సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళమ్!!’
- డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి
(సేకరణ :-జాగృతి వారపత్రిక)
Sunday, June 21, 2020
*స్వాతంత్ర్యం తర్వాత అయోధ్య ఉద్యమ సంఘర్షణ* (రామజన్మభూమి ఉద్యమగాథ-5)
నవ భారత్ నిర్మాణం దిశగా అడుగులు
నవ భారత్ నిర్మాణం దిశగా అడుగులు
నరేంద్ర మోదీతో సాధ్యంకానిదంటూ ఏదీ లేదు. ఇది బీజేపీ ఎన్నికల నినాదం కూడా. ఇది కేవలం నినాదంగానే మిగిలిపోలేదు. గత ఆరేళ్ల బీజేపీ పాలన దీన్ని రుజువు చేసింది. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ దశాబ్దాలుగా దేశం ఎదుర్కొంటున్న అనేక కఠిన సమస్యలను పరిష్కరించింది. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చింది. ప్రపంచంలో భారతదేశ కీర్తి, ప్రతిష్టలను పెంచింది.
2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చే ముందు.. పదేళ్ల యూపీఏ పాలనలో పైనుండి కింది స్థాయి వరకు అధికార యంత్రాంగం అవినీతిలో కూరుకుపోయింది. భారీ అక్రమూలు అనేకం వెలుగులోకి వచ్చాయి. సంస్కరణల విషయంలో ముందడుగు వేయలేకపోయారు. ఫలితంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. నిరుద్యోగం సంక్షోభస్థాయికి చేరింది. వృద్ధిరేటు మందగించింది. ద్రవ్య లోటు, వాణిజ్య లోటు హద్దులు దాటాయి. ఈ పరిస్థితులు మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి. దేశవ్యాప్తంగా జరిగిన తీవ్రవాద దాడులు ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాయి. దీంతో విసిగి వేసారిన ప్రజలు యూపీఏ పాలనకు చరమగీతం పాడారు.
తన అద్భుత మేధోశక్తితో, సమర్థ నాయకత్వంతో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ సాధించిన అభివృద్ధిని చూసి, ఆయనపై పూర్తి విశ్వాసంతో సంపూర్ణ మెజారిటీ ఇచ్చి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పాలనను గాడిలో పెట్టి, అనేక సంస్కరణలు చేపట్టి దేశంలో ఎన్నో గుణాత్మకమైన మార్పులను సాధించారు. గత 60 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయలేని అనేక పనులను ఈ ఆరేళ్లలో చేసి చూపించారు. తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపారు. అంతేకాదు, పారదర్శక పాలనతో సామాన్యులకు సైతం చేరువయ్యారు. జన్ధన్, ఆధార్, మొబైల్ త్రయాన్ని ప్రయోగించి వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రభుత్వ పథకాల ఫలాలను నేరుగా ప్రజలకు అందేలా చేశారు. పనికిరాని చట్టాలను తొలగించి వ్యాపార సౌలభ్యాన్ని పెంచారు. ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులలో పైరవీలకు చెక్ పెట్టింది. ఫలితంగా అసాధారణ సేవలందిస్తున్న అత్యంత సామాన్యులు సైతం పద్మ అవార్డులను అందుకుంటున్నారు.
ప్రతి వ్యక్తికి బ్యాంకు ఖాతా, సామాజిక భద్రత, కనీస అవసరాలైన ఇల్లు, గ్యాస్, విద్యుత్తు కనెక్షన్, మరుగుదొడ్డి, ఐదు లక్షల రూపాయల వరకు వైద్య సదుపాయం వంటివి కల్పించి పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చారు. సౌరవిద్యుత్తును ప్రోత్సహించి దేశవ్యాప్తంగా 24 గంటలు నిరంతరంగా విద్యుత్తు సరఫరా అయ్యేట్టు చేశారు. కిసాన్ సమ్మాన్ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. అంతేకాదు రైతులు పండించిన పంటలకు రికార్డు స్థాయిలో మద్దతు ధరలను పెంచారు.
తాత్కాలిక ప్రయోజనాలు ఒనగూర్చే పథకాలకు, ప్రజలను పూర్తిగా ప్రభుత్వం మీద ఆధారపడేట్లుగా చేసే పథకాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రజల ఆర్థికశక్తిని పెంచే వాటిపై దృష్టిసారించింది మోదీ ప్రభుత్వం. చిరు వ్యాపారులకు ముద్ర రుణాల ద్వారా రుణ సదుపాయం కల్పించి వారికి స్వయం ఉపాధి అవకాశాలను పెంచింది. స్టార్ట్ అప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా ద్వారా అంకుర కంపెనీలను ప్రోత్సహిస్తోంది. యువతలో నైపుణ్యాన్నిపెంచడానికి స్కిల్ ఇండియా వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నారు. తన అంతర్జాతీయ పర్యటనల ద్వారా, దౌత్య చతురతతో మోదీ ప్రపంచ దేశాలతో సంబంధాలను మెరుగుపర్చుకొని పాకిస్తాన్ను ఏకాకి చేశారు. చైనా దూకుడుకు కళ్లెం వేశారు. ప్రపంచ దేశాలతో అనేక ఒప్పందాలు చేసుకొని, విదేశీ పెట్టుబడులను సాధించి, విదేశీ పెట్టుబడిదారులకు భారత్ను తమకు ఇష్టమైన గమ్యంగా తీర్చిదిద్దారు.
ఇలా దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్న మోదీ 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో చరిత్రను తిరగరాస్తూ 303 స్థానాలు సాధించి తిరిగి రెండవసారి అధికారంలోకి వచ్చారు. గడిచిన ఏడాది అనేక సవాళ్ల మధ్య సాగింది. దేశం ఎదుర్కొంటున్న అనేక కఠిన సమస్యలను నరేంద్ర నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పరిష్కరించింది.
పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్లలో మతపరమైన వివక్షను ఎదుర్కొని భారత్కు వలస వచ్చిన మైనారిటీలకు పౌరసత్వం కల్పించే బిల్లుకు చట్టబద్ధత కల్పించారు. మతపరమైన వేధింపులు భరించలేక భారత్కు వలస వచ్చి దశాబ్దాలుగా ఎటువంటి గుర్తింపు లేక దుర్భరమైన జీవితాలు గడుపుతూ నలిగిపోతున్న వారికి స్వాంతన చేకూర్చారు. దేశ వ్యతిరేకశక్తులు, కొన్ని ప్రతిపక్షాలు ఈ బిల్లును ద్వారా దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టి అలజడులు సృష్టించాలని ప్రయత్నం చేసినా వాటిని మోదీ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు సాగింది. త్రివిధ దళాలను సమన్వయం చేయడానికి, సమర్థవంతంగా తమ బాధ్యతల్ని నెరవేర్చడానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ని నియమించాలని రక్షణ వర్గాల నుండి ఏళ్లుగా డిమాండ్ ఉంది. దాన్ని ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
యూపీఏ తప్పటగుల వల్ల సమస్యల కోరల్లో చిక్కుకున్న ప్రభుత్వ బ్యాంకులను బలోపేతం చేయడానికి, వాటి రుణ సామర్థ్యం పెంచడానికి పది బ్యాంకులను విలీనం చేసి నాలుగు పెద్ద బ్యాంకులుగా ఏర్పాటు చేసింది. దేశంలో కార్పొరేట్ పన్నును 22 శాతానికి తగ్గించి మన వ్యాపార సంస్థలు ప్రపంచ సంస్థలతో పోటీ పడడానికి వీలు కల్పించింది. కొత్తగా ప్రారంభించే ఉత్పత్తి సంస్థలకు కేవలం 15 శాతమే పన్ను విధించి వాటిని ప్రోత్సహిస్తున్నది. వ్యక్తిగత పన్నును కూడా సరళీకరించి మధ్య తరగతి ప్రజలపై పన్ను భారాన్ని తగ్గించింది.
ఇటీవల యావత్ ప్రపంచాన్ని చివురుటాకులా వణికిస్తున్న చైనా మహమ్మారి కరోనా వైరస్ నివారణలో సైతం నరేంద్ర మోదీని ప్రపంచ దేశాల నేతలు కూడా కొనియాడారు. సమయానుకూలమైన నిర్ణయాలు, సాహసోపేతమైన చర్యలతో, ప్రజల భాగస్వామ్యంతో భారతదేశం ప్రపంచ దేశాల కంటే మెరుగ్గా కరోనాను కట్టడి చేసి ప్రజల ప్రాణాలను కాపాడగలిగింది. సరైన సమయంలో లాక్డౌన్ను విధించి, పటిష్టంగా అమలు చేయడం ద్వారా పెను ప్రమాదం నుండి దేశాన్ని గట్టెక్కించారు. అంతేకాదు, దేశంలో ఆరోగ్య వసతులను పెద్ద ఎత్తున పెంచుకోగలిగాం. కరోనా భారత్కు చేరుకునే వరకు ఇలాంటి వైరస్లను పరీక్షించి నిర్ధారించేందుకు దేశంలో కేవలం ఒకే ఒక్క పరీక్షా కేంద్రం ఉండేది. ఇప్పుడు 600 పైగా పరీక్షా కేంద్రాలున్నాయి. గతంలో దేశంలో ఏడాదికి 45 వేల పిపిఈ కిట్లు ఉత్పత్తి అయ్యేవి. ఇప్పుడు రోజుకు 3 లక్షల పిపిఈ కిట్లు ఉత్పత్తి జరుగుతున్నది. 3.5 లక్షల ఎన్ 95 మాస్కులు ఉత్పత్తి అవుతున్నాయి. 10 లక్షల మందికి ఏకకాలంలో చికిత్స అందించే వసతులు కల్పించారు.
కరోనా నివారణలో భాగంగా రూ. 20 లక్షల కోట్లను ‘ఆత్మనిర్భర్ భారత్’ పేరుతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. మూడు లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్యాకేజీకి రూపకల్పన చేశారు. మొదటిది లాక్డౌన్ సందర్భంగా పేద ప్రజలు ఎవరూ కనీస అవసరాలకు ఇబ్బంది పడకూడదు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే దేశంలోని 80 కోట్ల మంది పేదలకు మూడు నెలల పాటు మనిషికి 5 కిలోల బియ్యం, కిలో పప్పు సరఫరా చేశారు. 20 కోట్ల మంది జన్ధన్ ఖాతా కలిగిన మహిళలకు మూడు నెలల పాటు నెలకు రూ. 500 చొప్పున సహాయం అందించారు. వీటికి అదనంగా పెన్షన్దారులకు రూ. 1000 అందిస్తున్నారు. వలస కార్మికులకు ఆహారానికి, వసతికి ఇబ్బంది కలుగకూడదని విపత్తు నిర్వహణ నిధుల నుండి ప్రభుత్వం రూ. 11,092 కోట్లు విడుదల చేసింది. ఇలా మొత్తం 1.72 లక్షల కోట్ల రూపాయలతో గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా పేద ప్రజలను, శ్రామికులను ఆదుకునే ప్రయత్నం చేశారు.
రెండవది, లాక్డౌన్ కారణంగా ఎవరూ ఉపాధిని కోల్పోవద్దు అనే ఉద్దేశంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం 3 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించి భారత్ను పారిశ్రామిక కేంద్రంగా మార్చడానికి చర్యలు చేపట్టింది. అంతేకాదు, ఇబ్బందుల్లో ఉన్న కంపెనీలను ఆదుకోవడానికి రూ.30 వేల కోట్లు, ఈక్విటీ ద్వారా మరో రూ.50 వేల కోట్లను ప్రకటించింది. లాక్డౌన్లో వ్యవసాయ పనులకు ఆటంకం కలగకూడదని వ్యవసాయ పనులకు మినహాయింపు ఇచ్చి, ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు ఎదురవకుండా రాష్ట్రాలకు నిధులందించారు. కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా 73,000 కోట్ల రూపాయలను ముందస్తుగా అందించి రైతులను ఆదుకునే ప్రయత్నం చేశారు.
మూడవది, కరోనా కారణంగా ప్రజల జీవన పద్ధతుల్లో వచ్చే మార్పుల కారణంగా వ్యాపార స్థితిగతులు, పరిధులు కూడా మారుతాయి కాబట్టి మారిన పరిస్థితులకు అనుగుణంగా అనేక రంగాల్లో నూతన ప్రభుత్వ విధానాలను ప్రకటించారు. ఇలా గత రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన అంతర్జాతీయ మాంద్యపు పరిస్థితులను, కరోనా పరిస్థితులను ప్రజల భాగస్వామ్యంతో అధిగమించి నవ భారత్ నిర్మాణం దిశగా మోదీ ప్రభుత్వం తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నది. ఇందులో ప్రధానంగా ప్రశంసించాల్సింది ప్రజలనే. మోదీ పట్ల వారు ప్రకటిస్తున్న అచంచలమైన విశ్వాసమే ఆయన బలం, అస్త్రం. అదే ఈ దేశం బలం కూడా.
ఏనుగుల రాకేష్రెడ్డి , బీజేపీ,
తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి
(సేకరణ:- జాగృతిి వార పత్రిక)Saturday, June 20, 2020
మానవాళి ఆరోగ్యానికి ఆయువు పోసేది యోగ*.
మార్కెట్లో స్వదేశీ సత్తా చూపు... చైనా దూకుడు ఆపు
*మరణం లేని మహావీరులు*
*మరణం లేని మహావీరులు* "మాతా భూమి పుత్రోహం పృథివ్యాః" - ఈ పుడమి నా తల్లి నేనామె పుత్రుడను. ఈ మాతృభూమి పట్ల అమిత భక్తి కల్గ...
-
యథా సముద్రో భగవాన్ యథా మేరుర్మహా గిరిః ఉభౌఖ్యాతౌ రత్న నిధీ తథా భారత ముచ్యతే ( ఆదిపర్వం) పరమ పవిత్రమైన సముద్రము మహోన్నతమైన మేరు పర్వతము, సర్...
-
తెలుగు సాహిత్యంలో అవధానం అనేది ఒక ప్రత్యేక ప్రక్రియ. ఏ ఇతర భాషల్లో లేనిది కేవలం తెలుగులో మాత్రమే ఉన్నది అవధానం.సంస్కృతం, తెలుగు...
-
ఒక దేశం యొక్క అభివృద్ధి మరియు పతనము అనేవి ఆదేశం యొక్క విద్యా విధానాన్ని బట్టియే ఉంటాయి. విద్య అనేది కేవలం ఉదర పోషణ క...