Sunday, September 27, 2020
వీరుడా నీకు వందనం
Thursday, September 24, 2020
కర్మయోగి పండిత దీనదయాళ్
మానవాళి సమగ్ర వికాసమే ఏకాత్మతా మానవ దర్శనం
మానవాళి సమగ్ర వికాసమే ఏకాత్మతా మానవ దర్శనం
మానవజాతి స్వయం వినాశనానికి గురి కాకూడదంటే పాశ్చాత్యంతో మొదలైన అధ్యాయం భారతీయంతో ముగియ వలసి ఉన్నది, మానవ జాతి చరిత్రలో అత్యంత విపత్కర సందర్భాల నుండి మానవ జాతిని విముక్తి చేయగలిగే మార్గం భారతీయం లోనే ఉంది. అశోక చక్రవర్తి, మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గం, రామకృష్ణ పరమహంస చాటిచెప్పిన సర్వమత సామరస్యం మానవజాతి మొత్తం ఒకే కుటుంబంగా అభివృద్ధి చెందడానికి కావలసిన దృక్పథం, స్ఫూర్తి అందులో ఉన్నాయి. మనల్ని మనం సర్వనాశనం చేసుకోకుండా ఉండేందుకు మన ముందున్న ఏకైక ప్రత్యమ్నాయం భారతీయమే. ఈ విషయాలు నానిపాల్కివాలా "ది ప్రైసెలెస్ ట్రెజర్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్" గ్రంథము లోనివి, అట్లాగే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ రెండవ సర్ సంఘ చాలకులు పూజనీయ శ్రీ గురూజీ మానవాళి సమగ్ర వికాసంలోని తొలి దశ భౌతిక వాదం, వికాసం ఎప్పుడూ స్థూలం నుంచి సూక్ష్మానికి సాగుతుంది, అందుకే తొలిదశలో మనిషి భౌతిక వాదం వైపు ఆకర్షితుడై తన శక్తులన్నింటినీ భౌతిక అవసరాలు తీర్చుకునేందుకు ఉపయోగిస్తాడు, ఇంకా కొంచెం పరిణతి చెందిన దశలో భావోద్వేగాలను అర్థం చేసుకొని మానసిక ఆనందం కోసం ప్రాకులాడుతాడు ఈ స్థితిలోనే అతడు కళల పట్ల సంస్కృతి పట్ల ఆకర్షితుడవుతాడు, కళారూపాలను సృష్టించడంలో కళలలో దాగిన సౌందర్యాన్ని గుర్తించడంలోను ఆనందాన్ని పొందడం మొదలు పెడతాడు, విజ్ఞాన శాస్త్రాలనీ, తత్వ శాస్త్రాలనీ అధ్యయనం చేసేందుకు పూనుకుంటాడు. మెల్ల మెల్లగా తన అస్తిత్వ పరమార్ధాన్ని గుర్తించే స్థాయికి ఎదుగుతాడు, ఆ తర్వాత బుద్ధికి కూడా అతీతమైన సూక్ష్మ స్థితిని, సచ్చిదానందాన్ని పొందుతాడు,ఇది మానవుడు పరిణామం చెందే క్రమం, వీటి గురించి ప్రపంచం ఏమీ ఆలోచిస్తుందో మన దేశం ఏమి ఆలోచిస్తున్నదో దీనదయాళ్ ఉపాధ్యాయ సమగ్రంగా ఆద్యయనం చేసి ఆధునిక యుగానికి అవసరమైన ఒక సమగ్ర ఆలోచనను మనకు అందించారు, ఆ అలోచనే "ఏకాత్మ మానవ దర్శనం".
దీనదయాళ్ ఉపాధ్యాయ 1916 సంవత్సరం సెప్టెంబర్ 25న ఉత్తరప్రదేశ్ లోని మధుర జిల్లాలో నగాలచంద్రభాను అనే గ్రామంలో జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు వారి చిన్న వయసు నుండే అద్భుత మేధాశక్తి వెల్లడైంది. వారి జీవితాన్ని దేశానికి సమర్పించిన మొదటి ఘట్టం 1937లో కాన్పూర్ లో డిగ్రీ చదువుతున్నప్పుడు రాష్ట్రీయస్వంసేవక్ సంఘం లో చేరటం, 1942 వ సంవత్సరం సంఘ ప్రచారక్ గా రావటం రెండవ ఘట్టం, 1952 సంవత్సరంలో భారతీయ జనసంఘ్ పార్టీలో ప్రవేశించడం మూడవ ఘట్టం, అనతికాలంలోనే భారతీయ జనసంఘంను జాతీయ పార్టీగా తీర్చిదిద్దిన సంఘటన కౌశల్యం వారిది, ఈ దేశ సమగ్ర వికాసం కోసం తద్వారా మానవ జాతి వికాసానికి నమూనాగా నిలువగలిగే ఏకాత్మత మానవ దర్శనం 1965 సంవత్సరం విజయవాడలో జరిగిన అఖిలభారత జన సంఘం కార్యకర్తల సమావేశంలో వివరించారు అది వారి జీవితంలో నాలుగో ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఆ క్రమంలో వారి ఆలోచనలను కొన్ని ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుందాము.
జీవన సమస్యల మీద ప్లేటో తాత్విక చింతనలను చదివిన వారు కూడా ఎక్కడ మానవ మేధస్సు అద్భుత ఆవిష్కరణలు చేసిందో, అతి ముఖ్యమైన జీవన సమస్యల మీద లోతుగా అధ్యయనం చేసిందో, ఆ భారతీయ తత్వశాస్త్రాలను వారు కూడా అధ్యయనం చేయవలసి ఉంది. మానవ జీవితాలకు గొప్ప పరిష్కారాలను ఎవరు కనుగొన్నారని నన్ను ఎవరైనా అడిగితే నేను భారతదేశాన్ని చూపిస్తాను. ఆక్కడ యూరప్ లో కేవలం గ్రీకుల, రోమన్ల, యూదుల ఆలోచనలతో ఎదిగారు. మనదేశంలో మనం మన అంతరంగ జీవితాన్ని మరింత పరిపూర్ణంగా, విస్తారంగా, విశ్వజనీనంగా, మానవీయంగా మార్చేందుకు, ఈ ఒక్క జన్మకే కాక శాశ్వతత్వాకి అవసరమైన సంస్కారాలను రూపొందించేందుకు కావలసిన వివరణ మన సాహిత్యంలో ఉన్నది. అది ఎక్కడి నుండి పొందగలము అన్న ప్రశ్న ఎవరైనా వేసిప్పుడు కూడా నేను భారతదేశాన్ని చూపిస్తాను, అని నాని పాల్కివాలా చెప్పారు.
అట్లా పాశ్చాత్య దేశాల ఆలోచనల ఆసమగ్రతను లోతుగా పరిశీలించారు దీన్ దయాల్ జీ. పాశ్చాత్య సిద్ధాంతాల అన్నింటిలోనూ ఉన్న ఒక సామాన్య లక్షణం ఏమిటంటే అవన్నీ కూడా ఒక విషయానికి ప్రతిస్పందనలగాను, లేదా ప్రతిక్రియాత్మకంగాను ఏర్పడిన సిద్ధాంతాలు, పోప్ నిరంకుశత్వానికి ప్రతి క్రియగా జాతీయవాదం ఏర్పడితే, రాజ్యం యొక్క విశేష అధికారాలను వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యం వచ్చింది, ఆ ప్రజాస్వామ్యము పెట్టుబడిదారీ విధానాన్ని పెంపొందించింది,పెట్టుబడిదారీ విధానానికి ప్రతి చర్యగా సమాజ వాదము[సోషలిజం ], సామ్యవాదం[కమ్యూనిజం] పుట్టుకొచ్చాయి, పైన చెప్పిన మూడు ప్రతిచర్యలు కూడా ఎన్నో సంఘర్షణలకు, రక్తపాతానికి కారణమయ్యాయి. ఏ సిద్ధాంతానికైనా సంఘర్షణలు అనివార్యమని సర్దిచెప్పుకోవచ్చు అయితే అక్కడ ఆ సంఘర్షణలను నివారించటానికి బదులు సంఘర్షణలకు సిద్ధాంత రూపం ఇవ్వడం జరిగింది, జీవ పరిణామమే సంఘర్షణల పరిణామమని ఆ సిద్ధాంతం చెబుతున్నది, డార్విన్ జీవ శాస్త్ర సిద్ధాంతం, హెగెల్ ప్రతిపాదించిన గతితార్కిక వాదం, మార్క్స్ చారిత్రక విశ్లేషణ అన్ని ఆ సంఘర్షణ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకున్నవే, పోటీని, సంఘర్షణను శాస్త్రీయ సత్యాలుగా పెట్టుబడిదారి అర్థశాస్త్రం పరిగణిస్తుంది, పెట్టుబడిదారీ వ్యతిరేక శక్తులన్నిటిని సమీకరించి విప్లవం ద్వారా వర్గ రహిత సమాజాన్ని సాధించాలని కలలు కన్నది కమ్యూనిజం. ఈ నేపథ్యంలో మానవ జీవితం గురించి దీనదయాళ్ జీ చెప్పిన మాటలు గమనిద్దాం. జీవితంలో చాలా అంశాలు ఒకదానితో మరొకటి కలిసిపోయి ఉంటాయి, ఏ అంశానికి ఆ అంశాన్ని విడివిడిగా మిగతా వాటితో సంబంధం లేకుండా అధ్యయనంచేసి దాని ఆధారంగా మానవ జీవితం మొత్తానికి సంబంధించిన తీర్మానాలు చేయడం సరైన ఫలితం ఇవ్వదు ఇలా అసమగ్రంగా సాగిన ఆలోచనలు, వాటి ఆధారంగా చేసిన సమన్వయాలే పాశ్చాత్య దేశాలలోని చాలా సమస్యలకు మూలకారణం అంటారు దీనదయాళ్ జీ. మనిషి జీవితాన్ని రాజకీయ, ఆర్థిక, సాంఘిక విషయాలు మాత్రమే ప్రభావితం చేయవు, మనిషికి కుటుంబం, జాతి,నమ్మకాలు అతని దేశచరిత్ర, సంస్కృతి సాంప్రదాయాలు, స్నేహితులు, శత్రువుల వంటివి ఎన్నో ఉంటాయి అవన్నీ అతనికి ముఖ్యం,ఈ విషయాలను గ్రహించటంలో కారల్ మార్క్స్ కూడా విఫలమైనాడు అలాగే కుటుంబాలకు దేశాలకు కూడా ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకి ఉంటాయి, ఒక కుటుంబానికి వాళ్ల కులదైవం, ఆచారాలు, సాంప్రదాయాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఒక దేశానికి దాని చరిత్ర భౌగోళిక పరిస్థితులు ఆచారాలు, ఆదర్శాలు దానికి ఉంటాయి. వాటన్నిటితో కలిసి ఏర్పడేదే ఒక ప్రత్యేక గుర్తింపు. అలా ప్రతి వ్యక్తికి, కుటుంబానికి, దేశానికి వాటి వాటి పరిధిలో ప్రత్యేకత, శక్తి వాటికి ఉంటాయి. ఐక్యత గురించి ఆలోచించేటప్పుడు ఈ విషయాలన్ని దృష్టిలో పెట్టుకోవాలి. నిజమైన ఐక్యత ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే ఎవరి ప్రత్యేకతలను వారు నిలబెట్టుకుంటూనే పరస్పరం సహకరించు కోగలిగినప్పుడు మాత్రమే సాధ్యం, దానినే మనం'' భిన్నత్వంలో ఏకత్వం'' అంటాము, అలా కాక భిన్నత్వాన్ని గుర్తించకుండా అన్ని వైరుధ్యాలను అణిచివేయడం ద్వారా లేక నియంత్రించడం ద్వారా ఐక్యత సాధించాలని ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం మనం ఆశించిన ఫలితాలను ఇవ్వదు, ఇవ్వకపోగా ద్వేషానికి సంఘర్షణలకు కారణం అవుతుంది, క్రిస్టియానిటీ, ఇస్లాం, కమ్యూనిజం చరిత్రలు దానికి సాక్ష్యం.
ఒక శిశువుకి ఉండే పరిమిత చైతన్య స్థాయి నుంచి సకల మానవాళిని కలుపుకునే స్థితి వరకూ సాగే ఈ ప్రయాణం గురించి దత్తోపంత్ జీ ఇలా వివరిస్తారు "నేను అనే పరిధి, కుటుంబం వంటి వివిధ వృత్తుల మీదుగా ప్రయాణించి సమస్త విశ్వం వరకూ విస్తరించడమే. ఆత్మ జ్ఞానానికి నిదర్శనం ఆత్మ జ్ఞానము గూర్చి అవగాహన ఎంతగా పెరిగితే అంతగా నేను గూర్చి వ్యాపకత పెరుగుతుంది. అయితే ప్రయాణంలో నేను అన్న చైతన్యం పైస్థాయికి సాగుతున్నప్పుడు అంతకు మునుపు దాటి వచ్చిన క్రింది స్థాయిలతో ఘర్షణ ఉండదు అవికూడా ఆ చైతన్యంలో లీనమయివుంటాయి, ఈ సిద్ధాంతం లోని ప్రత్యేకత ఏమిటంటే ఇది ప్రత్యేకంగా ఏకాంతంగా ఉండే '' నేను'' గురించి చెప్పదు, కొన్ని అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవటం , కొన్ని అంశాలను వదిలివేయడం ఉండదు అన్నిటినీ కలుపుతూ సాగుతుంది, విడివిడిగా చూడటం అంటే కుటుంబంతో కలిపినప్పుడు నేను నీ ప్రేమించి లేకపోవటం, సమాజంతో కలిసినపుడు కుటుంబాన్ని ప్రేమించి లేకపోవడం జరుగుతుంది. సర్పిలాకారము లో అటువంటి విభిన్న ఆత్మలకి స్థానం లేదు, ఉన్నది ఒక్కటే ఆత్మ, ఒకటే నేను, అంటే నాలోని నేను అనే చైతన్యం సమాజం వరకు వ్యాపించినప్పుడు నేను, సమాజాన్ని, కుటుంబాన్ని, నన్ను కూడా ప్రేమిస్తాను, అలాగే సకల మానవాళి తోనూ నన్ను నేను కలుపుకునే స్థాయికి ఎదిగినప్పుడు కూడా నా జాతిని దేశాన్ని నేను ప్రేమిస్తాను. అంతిమంగా విశ్వం తో తాదాత్మ్యం చెందినప్పుడు నేను నా దేశం తో నే ఉంటాను. వ్యక్తి, కుటుంబం, దేశం, సకల మానవాళి ఈ చరాచర సృష్టి చివరికి సర్వవ్యాపకుడైన పరమాత్మ ఇలా అన్ని విభిన్న స్థాయిలలో ఏకకాలంలో తాదాత్మ్యం చెందగలుగుతాను, అదే "ఏకాత్మతా మానవ దర్శనం".
ఒక సాధారణ వ్యక్తిగా మనం ఈ ఏకాత్మ మానవతా సిద్ధాంతం మొత్తాన్ని ఒకేసారి అర్థం చేసుకోవటం ,చేసుకున్న దానిని ఆచరించడం కష్టం కావచ్చు, కొద్ది కొద్దిగా అర్థం చేసుకొనే ప్రయత్నం చేయాలి అంచెలు అంచెలుగా మన ప్రయాణం సాగాలి.
--రాంపల్లి మల్లికార్జున్Monday, September 21, 2020
హజియా సోఫియా, రామమందిరం ఒకటేలా అవుతాయి?
హజియా సోఫియా, రామమందిరం ఒకటేలా అవుతాయి?
ఐదు శతాబ్దాల ధర్మబద్ధమైన పోరాటం ఫలించి ఆగస్ట్ 5న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ జరుగుతున్న సమయంలో ప్రజల సంతోషాన్ని, హర్షాన్ని నీరుగార్చేందుకు చాలా ప్రయత్నాలే జరిగాయి. కానీ కొందరి దుష్ప్రచారాన్ని పట్టించుకోకుండా ప్రజలంతా ఆ ఆనంద క్షణాలను ఆస్వాదించారు. రాజ్యాంగబద్ధంగా హిందూ సమాజం సాధించిన విజయం అది. హిందువుల సంయమనం, సహనం, ధర్మ బుద్ధిని ప్రశంసించవలసినదిపోయి బూటకపు సెక్యులరిస్ట్ లు, ఉదారవాదులు, ఇస్లాంవాదులు, ఉదారవాదులుగా చెలామణి అవుతున్న ఇస్లాంవాదులు పదేపదే హిందువులను అవమానించారు. అదృష్టవశాత్తు హిందువులు కూడా `భౌతికమైన’ దాడులకు దిగలేదు.
అన్ని మతాలను ఒకటిగా చూసే హిందువును కూడా ఇటీవల కొన్ని పరిణామాలు మాత్రం ఆలోచనలో పడవేసే విధంగా ఉన్నాయి.
టర్కీలోని హజియా సోఫియా ప్రదర్శనశాలను మసీదుగా మారుస్తున్నట్లు ఆగస్ట్ 9న అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఒకప్పుడు అది మసీదేనని, క్రైస్తవులే దానిని చర్చ్ గా మార్చారని ప్రభుత్వం తెలిపింది. కమల్ అతతుర్క్ కాలంలో ఆ చర్చ్ ని ప్రదర్శనశాలగా చేశారు. అయితే క్రైస్తవులు, ముస్లింల మధ్య ఆ కట్టడం అనేకసార్లు చేతులుమారిందన్నది ఎవరూ చెప్పరు. ఒకప్పుడు పాగన్ ఆలయం అయిన ఆ కట్టడం మసీదుగా మారడానికంటే ముందు చర్చ్ గా ఉండేదన్నది నిజం. ప్రదర్శనశాలను తిరిగి మసీదుగా మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో టర్కీలో ఇస్లామిక్ పాలనను పక్కనపెట్టి సెక్యులర్ వ్యవస్థను వృద్ధి చేయడం కోసం ఒకప్పుడు అతతుర్క్ పడ్డ తాపత్రయం ఇప్పుడు పూర్తిగా బూడిదిలో పోసిన పన్నీరు అయింది. మసీదు ఎప్పటికైనా మసీదేనని, దానిని ఎప్పటికైనా ఆవిధంగానే పునరుద్ధరిస్తామని ఈ సందర్భంగా ఇస్లాంవాదులు సగర్వంగా ప్రకటించారు.
అయితే ప్రవక్త స్వస్థలమైన సౌదీ అరేబియాలో కూడా అనేక మసీదులను `తొలగించారు’ అనే సంగతి వీళ్ళు మరచిపోతుంటారు. ఆ తొలగింపు కూడా వాటిని పెద్దవి చేసి, మరింతమంది ప్రార్ధనలు చేసుకునేందుకు వీలుగా తయారుచేసేందుకు కాదు. విలాసవంతమైన హోటళ్లు కట్టడానికి అలా మసీదులు తొలగించారు. “విలాసవంతమైన హోటళ్లు, దుకాణా సముదాయాలు, ఆకాశహర్మ్యాలు కట్టడం కోసం మక్కా, మదీనాల్లోని చరిత్రాత్మక ప్రదేశాలను కూడా కూల్చివేయడాన్ని స్థానికులు, వారసత్వ సంపద కాపాడాలనే ఉద్యమకారులు నిర్ఘాంతపోయి చూశారేకాని ఏమి అనలేకపోయారు. గత 20ఏళ్లలో ఈ రెండు నగరాల్లో ఉన్న వెయ్యెళ్ళనాటి పురాతన కట్టడాలలో 95శాతం కూల్చివేశారని వాషింగ్టన్ లోని గల్ఫ్ సంస్థ అంచనా వేసింది. ఒట్టమాన్ కాలం నాటి అయ్యద్ కోటను, ఆ కోట ఉన్న కొండను కూడా సౌదీ ప్రభుత్వం పూర్తిగా కూల్చేసింది. ఇతర చారిత్రక స్థలాలకు కూడా ఇదే గతి పట్టింది. మహమ్మద్ ప్రవక్త పుట్టిన ఇల్లును గ్రంధాలయంగా చేస్తే, ఆయన మొదటి భార్య ఖదీజా ఇంటిని మూత్రశాలగా మార్చారు’’ అని 2012 అక్టోబర్ 26 నాటి ఇండిపెండెంట్ పత్రిక వ్రాసింది. పాకిస్తాన్ లో కూడా ఇలా మసీదులను తొలగించిన సంఘటనలు చాలానే ఉన్నాయి.
హజియా సోఫియాను మసీదుగా తిరిగి మార్చడం ఒకప్పుడు జరిగిన తప్పిదాన్ని సరిచేయడం కోసమేనని అంటే హిందువులకు కూడా అలాంటి హక్కే ఉంటుంది కదా. టర్క్ లు, మంగోలుల దాడులు, విధ్వంసాన్ని ఎదుర్కొన్న హిందువులు తమ దేవాలయాలను పునరుద్ధరించుకోవాలనుకుంటున్నారు. పైగా భారత్ లో ఇలా ఒక కట్టడం అనేకసార్లు, అనేకమంది చేతులు మారిన వివాదం కూడా లేదు. హజియా సోఫియాను తిరిగి మసీదుగా మార్చడం గురించి ఏ సెక్యులర్ – ఉదార – కమ్యూనిస్ట్ – ఇస్లాంవాదీ ప్రశ్నించలేదు, మాట్లాడలేదు. కానీ తమ దేవాలయాలను పునరుద్ధరించుకోవడానికి హిందువులకు ఉన్న హక్కును మాత్రం ప్రశ్నిస్తున్నారు, కాదంటున్నారు. ఎంతటి ద్వంద్వ వైఖరి !
అలాగే ముస్లిం ప్రతినిధులమని చెప్పుకుంటున్న కొందరు అయోధ్యలో ఉన్నది నూటికి నూరుపాళ్లు మసీదే అని, తాము తగిన బలం సంపాదించుకున్న రోజున రామమందిరాన్ని తిరిగి మసీదు చేయడం ఖాయమని బహిరంగంగా ప్రకటనలు చేసినప్పుడు కూడా ఈ సెక్యులర్ వాదులు ఏమి మాట్లాడలేదు.
ఈ ప్రకటన నిజానికి భారత రాజ్యాంగంపై, భారతీయ రిపబ్లిక్ వ్యవస్థపై పెద్ద దాడి. తమ ప్రయోజనాలకు తగినట్లుగా ఉన్నంతవరకే భారత రాజ్యాంగాన్ని ముస్లింలు అంగీకరిస్తారని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB) చెప్పదలుచుకుందా? తమకు అంగీకారం కాకపోతే షరియాను అమలు చేస్తారా? టీవీలు, వివిధ ప్రసార మాధ్యమాల్లో పలు చర్చల్లో పాల్గొనే ఈ స్వయంప్రకటిత ముస్లిం నేతలు తమకు రాజ్యాంగం కంటే షరియా పైనే గౌరవం ఎక్కువని బాహాటంగానే ప్రకటిస్తుంటారు. తమ అణచివేత, ఆక్రమణ ధోరణి బయటపడిపోకుండా రాజ్యాంగంపై గౌరవం, రాజ్యాంగ విలువలు అనే ముసుగు వేసుకుంటూ ఉంటారు. ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ఇస్లాంవాదులు ఇలాగే చట్టాలను కించపరుస్తూ, వ్యవస్థలను తూలనాడుతూ ఉంటారు.
వారికి `అవిశ్వాసుల’పై ఉండే అసహనం, కోపం వారి మాటల్లో ఎప్పుడు పయటపడుతూనే ఉంటుంది. మధ్య ప్రాచ్య ప్రాంతం నుంచి `పీడితులైన’ముస్లింలు పక్కనే ఉన్న ముస్లిం రాజ్యంలోకి వెళ్లకుండా పరమతానికి చెందిన యూరప్ కు పడవల ద్వారా చేరుకున్నారు. అక్కడకు శరణార్ధులుగా, దొడ్డిదారిన చేరినవాళ్ళు కాస్త స్థిరపడిన వెంటనే దారుల్ – హర్బ్ (అవిశ్వాసుల భూమి)ను దారుల్ – ఇస్లాం (ఇస్లాం భూమి)గా మార్చడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అంతే యూరప్ భగ్గున మండింది. ఇక ఇస్లాం దేశాల్లో కూడా ప్రధాన ఇస్లాం శాఖలకు చెందనివాళ్లు, కుర్డులు, యజ్దీల పరిస్థితి కూడా దారుణంగా ఉంటుంది.
రాగల కొన్ని సంవత్సరాల్లో యూరోప్ గతి ఏమవుతుంది? ఇటీవలి బాంబు పేల్లుళ్ళు ప్రమాదవశాత్తు జరిగాయా లేక తీవ్రవాదుల దాడులా అన్నది ఇంకా తేలలేదు. లెబనాన్ ఇప్పటికే పూర్తి షరియా రాజ్యంగా మారిపోయింది. కొన్ని సంవత్సరాల్లో యూరోప్ లో కూడా అదే పరిస్థితి ఏర్పడవచ్చును. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పుడు వేలాదిమంది `అణచివేతకు గురైన’ పాలస్థినియన్లు లెబనాన్ లో ప్రవేశించారు. ఉదార, ప్రజాస్వామ్య విధానానికి కట్టుబడిన లెబనాన్ వారందరికి ఆశ్రయం కల్పించింది. 1975నాటికి పాలస్తినియన్ల సంఖ్య 5లక్షలకు చేరింది. అప్పుడే అక్కడ పాలస్తీనా లిబరేషన్ సంస్థ కార్యలయం కూడా వెలసింది. అదే సంవత్సరం పౌరయుద్ధం చెలరేగి ముస్లింలకు `మెరుగైన ప్రతినిధ్యాన్ని’ కల్పించడం కోసం లెబనాన్ ను రెండుగా విభజించారు. కొన్ని దశాబ్దాలలోనే లెబనాన్ తన ఉదారవాద, సంపన్న స్థితిని కోల్పోయింది.
ఇస్లాంవాదులవల్ల వివిధ దేశాలు వివిధ కారణాలతో నాశనమయ్యాయి. కానీ వాటన్నింటిలో ఉదార ప్రజాస్వామ్య సమాజం మాత్రం పూర్తిగా కనుమరుగయ్యింది. ఒకప్పుడు జిన్నా కూడా సెక్యులర్ పాకిస్థాన్ ఏర్పాటుచేస్తానని హామీ ఇవ్వలేదా? వివిధ దేశాల్లో ఉదారవాదులు, ప్రజాస్వామ్యవాదులను నమ్మించడానికి, చివరికి మోసగించడానికి వేరువేరు అంశాలను వాడుకున్నారు. చివరికి ప్రజాస్వామ్యవాదులు ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గ్రహించేలోగానే వామపక్ష నాస్తికులు, మతఛాందస ఇస్లాంవాదులు కలిసి మొదట ప్రత్యేక సదుపాయాలు, హక్కులు పొంది ఆ తరువాత పూర్తిగా దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. అనేక ఆఫ్రికా దేశాల్లో కూడా ఇదే జరిగింది. సూడాన్ విభజన, నైజీరియా, కెన్యాల పతనం ఇలాంటివే. ఇక అణచివేత విషయానికి వస్తే కమ్యూనిస్ట్ ల రాజ్యంలో ఇస్లాంవాదులు, ఇస్లాం దేశాల్లో కమ్యూనిస్ట్ లు అణచివేతకు గురయ్యారు. ఒకప్పటి సోవియట్ యూనియన్, ఇప్పటి చైనా చూడండి. కానీ కమ్యూనిస్ట్ లు, ఇస్లాం వాదులు కలిసి ప్రజాస్వామ్య దేశాలను నాశనం చేస్తూనే ఉన్నారు.
ఈ సత్యాలను గురించి ఎవరు మాట్లాడతారో వారు ఇస్లాం వ్యతిరేకులు అని ముద్ర వేస్తారు. కానీ నిజాలు చెప్పవలసిందే. ఎందుకంటే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను ఉపయోగించుకుని చివరికి షరియా రాజ్యాన్ని తేవడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని భారతీయులందరూ తెలుసుకోవాలి, అప్రమత్తమవ్వాలి. అవిశ్వాసులపై యుద్ధం చేసి వారిని జయించడం అన్నది మాత్రమే వారి అంతిమ లక్ష్యమని, అందులో ఎలాంటి రాజీ ఉండదని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ప్రకటన చూస్తే అర్ధమవుతుంది.
పవిత్ర గ్రంధంలో చెప్పిన ప్రకారమే తాము చేస్తున్నామని తీవ్రవాదులు చెప్పే మాటలు నమ్మరాదని, `నిజమైన’ ముస్లింలు వేరని, వాళ్ళు అలా వ్యవహరించరని నిజాలను చూడలేని కొందరు ఇతరులను మభ్యపెట్టాలని చూస్తారు. వహాబీలు చెప్పేవన్నీ నిజం కావని వాళ్ళు గ్రహించరు. “నీకు నీ మతం ఎంతో, నాకు నా మతం’’ (109:1-6) అనే సూక్తి నిజమే అయినా, `పవిత్ర మాసాలు పూర్తయిన తరువాత విగ్రహారాధకులను ఎక్కడ దొరికితే అక్కడ చంపేయ్యి. బందీలుగా పట్టుకో. వాళ్ళను వెంటాడి వేటాడు. వాళ్ళు లొంగిపోతే ప్రార్ధన చేయించు, వాళ్ళు జకా ఇస్తే పుచ్చుకుని వదిలిపెట్టు. ఎందుకంటే అల్లా క్షమిస్తాడు, జాలిచూపిస్తాడు’(9.5) అని కూడా అదే గ్రంధంలో ఉంది. వహాబీలు ప్రవక్త జీవితంలో రెండవ అంశాన్నే అనుసరిస్తామని అంటే అది తప్పని చెప్పే ధైర్యం, బలం ఈ `సెక్యులర్’వాదులకు లేవు. ఆ విధంగా `శాంతిమతం’ వహాబీల చేతిలో చిక్కుకుంది.
ప్రాచీన నాగరకతను పునరుద్ధరించుకునే కార్యంలో రామమందిర నిర్మాణం మొదటి అడుగు మాత్రమే. ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ప్రకటన, హజియా సోఫియా, రామమందిరాలను ఒకే గాటన కడుతున్న వామపక్ష – ఉదార – ఇస్లాంవాదుల కూటమి వాదన భారతీయ నాగరకతపై జరుగుతున్న దాడులు అంతంకాలేదని స్పష్టం చేస్తాయి. మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎదురవుతున్న సవాళ్ళు ఈ పోరాటం మరింత ఉధృతమవుతున్నదని సూచిస్తున్నాయి.
– – రతన్ శార్దా
Source:- VSK TelanganaThursday, September 17, 2020
*నిజాం నిరంకుశత్వాన్ని నిరసించిన కలాలు*
Tuesday, September 15, 2020
అరాచక శక్తుల నుండి బయట పడినప్పుడే తెలంగాణకు నిజమైన స్వాతంత్రం
Thursday, September 10, 2020
అమెరికా సోదర సోదరీమణులారా!
తనను తానుపొగుడుకొంటున్న చైనా
Saturday, September 5, 2020
నిషేధం పై ఎట్టకేలకు స్పందించిన చైనా
Friday, September 4, 2020
దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే
*మరణం లేని మహావీరులు*
*మరణం లేని మహావీరులు* "మాతా భూమి పుత్రోహం పృథివ్యాః" - ఈ పుడమి నా తల్లి నేనామె పుత్రుడను. ఈ మాతృభూమి పట్ల అమిత భక్తి కల్గ...
-
యథా సముద్రో భగవాన్ యథా మేరుర్మహా గిరిః ఉభౌఖ్యాతౌ రత్న నిధీ తథా భారత ముచ్యతే ( ఆదిపర్వం) పరమ పవిత్రమైన సముద్రము మహోన్నతమైన మేరు పర్వతము, సర్...
-
తెలుగు సాహిత్యంలో అవధానం అనేది ఒక ప్రత్యేక ప్రక్రియ. ఏ ఇతర భాషల్లో లేనిది కేవలం తెలుగులో మాత్రమే ఉన్నది అవధానం.సంస్కృతం, తెలుగు...
-
ఒక దేశం యొక్క అభివృద్ధి మరియు పతనము అనేవి ఆదేశం యొక్క విద్యా విధానాన్ని బట్టియే ఉంటాయి. విద్య అనేది కేవలం ఉదర పోషణ క...